Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను  జయప్రదం చేద్దాం

జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను  జయప్రదం చేద్దాం

- Advertisement -

– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్దమైన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాల అమలుకు సమరశీల పోరాటాలు తప్పవని,దానిలో భాగంగానే జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ నూర్జహాన్ మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కరానికి,కార్మిక భద్రథ కి,సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారని అన్నారు. కార్మిక చట్టాలని కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం ముజువాణి ఓటుతో పార్లమెంట్ లో మార్పులు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని అన్నారు. కార్పొరేట్ యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి,వారి ఆదాయాలను మరింత రెట్టింపు ఛేయడానికి,కార్మిక వర్గం రక్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి నాలుగు లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇప్పటికే దేశం లోని బిజెపి పాలిత రాష్ట్రాలలో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తున్నారని,బిజెపి మిత్రుడుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాలను పూర్తైనా సందర్భం లో కార్మికులకు ఎనిమిది గంటల పని స్థానంలో పది గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారన్నారు.కాంగ్రెసు పాలిత కర్ణాటక,రాజస్థాన్ లలో నాలుగు లేబర్ కోడ్ ల అమలుకు రంగం సిద్దమ్ చేశారన్నారు.ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా,కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్నదులకు గురి చేయడం తప్ప మరొకటి లేదన్నారు.కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు జులై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ని జిల్లాలో అన్ని రంగాల్లో అత్యంత జయప్రదంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, గణేష్, రమేష్ నరేష్ రఫీక్ ముకుంద, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -