నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందల్ వాయి అటవీశాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం తిర్మన్ పల్లి సెంట్రల్ నర్సరీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాహసిల్దార్ వెంకట్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం అధికం కావడంతో పర్యావరణం పై పేను ప్రభావం పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో తమ వంతుగా చెట్లను నాటి పర్యావరణ న్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జలసంఘం అధ్యక్షులు గట్టు కడారి, డిప్యూటీ రేంజ్ అధికారి తుకారం రాథోడ్, సెక్షన్ అధికారులు బీట్ అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చెట్లను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES