నవతెలంగాణ-హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళ్లు అర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యవాది, కమ్యూనిస్ట్ నాయకుడు తెలియజేశారు.
విద్యా సంస్థలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయులు నారాయణ రెడ్డి కొనియాడారు. భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన అరుదైన రికార్డు వారి సొంతమన్నారు. రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.