నవతెలంగాణ – హైదరాబాద్: రాగల మూడురోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర గుజరాత్ మీదుగానున్న ఉపరితల ఆవర్తం నుంచి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గడ్, ఉత్తర ఒడిశా మీదుగా అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతూ.. సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశగా వంగి ఉందని తెలిపింది. తెలంగాణలో మూడురోజులు వానలు కొనసాగుతాయని చెప్పింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- Advertisement -
- Advertisement -



