- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య దిగ్గజం, ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని సాహితీ ప్రస్థానంతో కెన్యాను బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర దేశంగా మార్చిన గూగీ వా థియోంగో కన్నుమూశారు. 87 ఏళ్ల గూగీ వా వీప్ నాట్, చైల్డ్ అండ్ పెటల్స్ ఆఫ్ బ్లడ్ వంటి ప్రఖ్యాత నవలలతో ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా ఆయన స్థానిక ఆఫ్రికన్ భాషలలో సాహిత్య రచనలను ప్రోత్సహించారు. బ్రిటీష్ వలస పాలనలో జైలుపాలైన ఆయన దేశ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. నోబెల్ బహుమతికి గూగీ వా థియోంగో పలుమార్లు నామినేట్ అయినా.. ఆ పురస్కారం అతడిని వరించకపోవడం దురదృష్టకరం.
- Advertisement -