‘ఆ తర్వాత…’ ఆవిష్కరణ
కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవిత్వం ‘ఆ తర్వాత…’ పుస్తకావిష్కరణ సభ ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్లో జరుగుతుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగే ఈ సభలో డా||ఎస్.రఘు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తనికెళ్ల భరణి, కె.ఎస్.రవికుమార్, డా||సీతారాం, కోయి కోటేశ్వరరావు, వల్లపురెడ్డి మనోహర్ రెడ్డి పాల్గొంటారు.
కవిసంగమం ఆహ్వానం!
రెండుతరాల కవిసంగమం సీజన్ – 2 సీరీస్ – 41, ఈ నెల 14 సాయంత్రం ఆరుగంటలకు -:తెలుగు శాఖ – నిజాం కాలేజీ బషీర్ బాగ్, హైదరాబాద్లో జరుగుతుంది. పాల్గొను కవులు: లక్ష్మీనరసయ్య గుంటూరు, తుల శ్రీనివాస్, రూప రుక్మిణి, జబ్బు వెంకటేష్, చుక్క వంశీ (నిజాం కాలేజి విద్యార్థి).
బర్కతి ఆవిష్కరణ
డా|| సాగర్ల సత్తయ్య రచించిన బర్కతి ఆవిష్కరణ సభ సృజన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15 ఉదయం 10 గంటలకు యుటిఎఫ్ భవన్ నల్లగొండలో జరుగుతుంది. ఈ సభలో పెరుమాళ్ల ఆనంద్, డా||సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, మునాసు వెంకట్, డా||తండు కృష్ణ కౌండిన్య, డా||పగడాల నాగేందర్, మేక నాగయ్య, బోధనం నర్సిరెడ్డి, శీలం భద్రయ్య పాల్గొంటారు.
– సృజన సాహితీసంస్థ
‘అల్లిక’ ఆవిష్కరణ
ప్రొ|| చల్లపల్లి స్వరూపరాణి కవితా సంపుటి ‘అల్లిక’ ఆవిష్కరణ ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు బాలోత్సవ్ భవన్,రెండో అంతస్తు, విజయవాడలో జరుగుతుంది. ఈ సభలో జి.లక్ష్మినరసయ్య, శిఖామణి, యాకూబ్, గూడురు సీతామాలక్ష్మి, నూకతోటి రవికుమార్, షేక్ కరీముల్లా, దుప్పల రవికుమార్, నరేష్ కుమార్ సూఫీ, కాసుల రవికుమార్, పేరూరి మురళీ కుమార్, వున్నవ వినరు కుమార్, మల్లవరపు ప్రభాకరరావు పాల్గొంటారు.
– బహుజన రచయితల వేదిక, కుసుమ ధర్మన్న సాహిత్య వేదిక, సామాజిక పరివర్తన కేంద్రం, సామాజిక న్యాయంపోరాట సమితి.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -