– ఇండియన్ బ్యాంక్ మంజూరు
నవతెలంగాణ – హైదరాబాద్
స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీ)లకు రూ.150 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ్ బజరంగ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆ బ్యాంక్కి చెందిన తెలంగాణ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రాణేష్ కుమార్, హైదరాబాద్ జోనల్ మేనేజర్ కె శ్రీనివాస్, కరీంనగర్ జోనల్ మేనేజర్ పిఎస్ఎస్ సుధాకర్ రావు, మల్కాజ్గిరి జోనల్ మేనేజర్ స్వర్ణ ప్రభా సుందర్రారు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జోన్లో రూ.50 కోట్లు, కరీంనగర్ జోన్లో రూ.55 కోట్లు, మల్కాజ్గిరి జోన్లో రూ.45 కోట్లు చొప్పున ఎస్హెచ్జీలకు అందజేశారు. ”స్వయం సహాయక సంఘాలు సమాజంలో సమగ్ర ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. మహిళల సాధికారతకు ఇండియన్ బ్యాంక్ నిరంతరం మద్దతును అందిస్తుంది. అర్హత కలిగిన ప్రతీ ఎస్హెచ్జీకి రుణాలను అందించడమే మా బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.” అని శివ్ బజరంగ్ సింగ్ తెలిపారు.
ఎస్హెచ్జీలకు రూ.150 కోట్ల రుణాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES