- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో పార్టీ పరంగా అమలు చేయాలని చూస్తోంది. ఈనెల 18న క్యాబినెట్ భేటీలో చర్చించి ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాటు చేస్తోంది. గుజరాత్ నుంచి 37,530 బ్యాలెట్ బాక్సులు హైదరాబాద్కు చేరుకున్నాయి. వాటిని రెండు రోజుల్లో జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లు స్టేట్ ఈసీ అధికారులు వెల్లడించారు.
- Advertisement -