- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



