- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



