- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అడ్డంకులను అధిగమించిన భారత నౌకాదళానికి చెందిన శివాలిక్ నౌక, గుజరాత్లోని ముంద్రా పోర్టుకు కొద్ది గంటల్లో చేరుకోనుంది. ఈ నౌకలో సుమారు 40-46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (LPG) నిల్వలు ఉన్నాయి. దీని రాకతో దేశంలో గ్యాస్ కొరత కొంతవరకు తీరనుంది. మరోవైపు, 46వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో ‘నందా దేవి’ అనే మరో నౌక కూడా త్వరలో భారత్కు చేరుకోనుంది. దీనికి భారత నౌకాదళం భద్రతా ఏర్పాట్లు కల్పిస్తోంది.
- Advertisement -



