- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ టీచర్స్ అవార్డ్స్ -2025కు తెలంగాణకు చెందిన టీచర్ ఎం.పవిత్ర ఎంపికయ్యారు. కేంద్ర విద్యాశాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే పురస్కారానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 45 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి అవార్డు కోసం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ జెడ్పీహెచ్ఎస్లో విధులు నిర్వహిస్తున్న ఎం.పవిత్రను ఎంపిక చేశారు. అవార్డును సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ఉత్సవంలో అందజేయనున్నారు. ఈ అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, రూ.50 వేల నగదు, సిల్వర్ మెడల్ను అందజేస్తారు.
- Advertisement -