Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆదివాసి గ్రామాలను పర్యటించిన మడె పూర్ణిమ 

ఆదివాసి గ్రామాలను పర్యటించిన మడె పూర్ణిమ 

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి : మండలంలోని భూపతిపూర్, పంబాపూర్, గంగారం బంజర గ్రామాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మడే పూర్ణిమ సోమవారం సందర్శించి పరిశీలించారు. ఆదివాసి గిరిజనులతో వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయని ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి తండ్రిగారైన కీర్తిశేషులు ఎట్టి వెంకట నరసయ్య కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆయన ప్రజాసేవకే అంకితమై మృతి చెందారు. వారి అడుగుజాడల్లోనే వారి కూతురైన మడే పూర్ణిమ అన్ని గ్రామాలను సందర్శించి పరిశీలిస్తున్నారని గ్రామాల ప్రజలు హర్షించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad