- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండ పోలింగ్ బూత్ పరిశీలించేందుకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు తనను పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికులు కాకపోయినా కాంగ్రెస్ నాయకులను లోపలికి పంపిస్తున్నారని, అభ్యర్థి అయిన తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు.
- Advertisement -



