– మీ రుణం తీర్చుకుంటా : బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దేవుని గడపలో జరిగిన మహానాడుకు ప్రజల స్పందన అదిరిందని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. లక్షలాధి మంది వచ్చారని ప్రకటించారు. కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. గురువారం కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జై తెలుగుదేశం అని కార్యకర్తలతో చెప్పించారు రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాల న్నారు. జనసంద్రంగా కడప నిండిపోయిందన్నా రు. ఎన్నోసార్లు కడపకు వచ్చాననీ, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని తెలిపారు. కానీ కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవునిగడపలో జరిగిందని గుర్తు చేశారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతున్నదనీ, కడప గడపలో మార్పు కనిపిస్తున్నదని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానని గుర్తు చేశారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారనీ, 52 సీట్లకు 45 సీట్లతో కూటమిని గెలిపించారన్నారు. వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే, టీడీపీ కూటమిని ఒక్క ఉమ్మడి కడప జిల్లాలోనే ఏడు సీట్లతో గెలిపించారన్నారు. ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నామనీ, కానీ ఓడిపోయిన పార్టీ ఇంకా అర్థం చేసుకోలేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయ కులు అవమానాలు, అక్రమ కేసులు, నిర్బంధాలు అన్నింటినీ ఎదుర్కొన్నారని వివరించారు. ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందంటే అది కార్యకర్తలు, నేతలు త్యాగాలే వల్లేనని అభినందించారు. ఎన్నికల్లో మెజార్టీలు అత్యధికంగా వచ్చాయన్నారు. ఏడాది క్రితం రాష్ట్రం విధ్వంస పాలనతో 30 ఏండ్లు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. ‘కష్టాలు, సవాళ్లను చూసి నేను భయ పడలేదు. నేను క్లైమోర్మైన్లకు భయపడలేదు. వీటికి భయపడతానా’ అని చంద్రబాబు ప్రశ్నించారు సైకిళ్లు వేసుకుని కడప మహానాడుకు వచ్చా రంటూ.. కోడూరు నుంచి సైకిల్ వేసుకుని వచ్చిన వ్యక్తిని సభా వేదికపై సీఎం చూపించారు. ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీకైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఇటువంటి కార్యకర్తలు ఉండటం పార్టీకి అదష్టమ న్నారు. అన్న క్యాంటీన్లు తెరవడం, రోడ్లు బాగుచేయడం, పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేయడం, దేవాలయాల్లో అన్నదానం తదితర కార్యక్రమాలను చేపట్టా మని గుర్తుచేశారు. గతంలో కేంద్ర పథకాలు నిధులు మళ్లీంచారని విమ ర్శించారు. తాను వెంటనే పథకాలను పునరుద్ధరించానని తెలిపారు. తెలుగు దేశం అంటేనే బీసీల పార్టీ అని, బీసీల కోసం బడ్జెట్లో రూ.47 వేల కోట్లు పెట్టామని చెప్పారు. పలు బీసీ వర్గాలకు ఇచ్చిన పథకాలను సీఎం సభ దృష్టికి తెచ్చారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీగా సోలార్ విద్యుత్ ఇస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పంపు సెట్ల వద్ద సోలార్ విద్యుత్ పెట్టుకోవాలని సూచించారు. ఉద్యోగులను గత ప్రభుత్వం అవమా నాలకు గురి చేసిందనీ, కానీ ఇప్పుడు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. వారికి ఇప్పటికే రూ.7500 కోట్లు బకాయిలు ఇచ్చామన్నారు. కూటమి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. రాబోయే మహానాడు నాటికి భూ సమస్యలు లేకుండా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
ఇక్కడ ఉంది సీబీఎన్.. గుర్తుపెట్టుకోండి
దేశానికి టెర్రరిస్ట్ల వల్ల చాలా నష్టం జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. మన దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు వలన నష్టం కలుగు తోందన్నారు. నాసిరకం మద్యం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అన్నారు. గంజారు వల్ల అనేక మంది భవిష్యత్ నాశనమైందని గుర్తు చేశారు. అడవులను ఆక్రమించుకొని ఎస్టేట్లు కడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్థిక ఉగ్రవాదులు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తా. డ్రగ్స్ అమ్మే వారికి అదే చివరి రోజు అవుతుంది. ఇక్కడ ఉంది సీబీఎన్ అని గుర్తు పెట్టుకోండి’ అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విధ్వంస రాష్ట్రం పునర్నిర్మా ణానికి పనిచేస్తున్నా మన్నారు. వైనాట్ గొడ్డలిపోట్లు అనేవి మన విధానం కాదనీ, ప్రతిక్షణం కష్టపడి పనిచేయడమే మన విధానం, కష్టాలు చూసి బెదిరిపోలేదు సవాళ్లు చూసి పారిపోలే దన్నారు. పేదల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే నా జీవితాశ యమని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని, నా కష్టం నాకోసం కాదు, నన్ను నమ్మిన జనం కోసం, మనం కలిసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్సే ఉండ దని అభిప్రాయపడ్డారు. రాయ లసీమను రాష్ట్రానికి మనిహారంగా మారు స్తామని ప్రకటించారు.గత పాలన లో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశాయి, భూతాన్ని శాశ్వతంగా భూస్థా పితం చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతామ న్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాదని చెప్పారు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్ప్లాంటు పనులు ప్రారంభిస్తామని ప్రకటిం చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లా డుతూ కడప లో మహానాడు విజయవంతమైం దన్నారు. ఇందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. పార్టీ లేకుండా చేస్తామన్నారు, వైనాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ వేశారు. ప్రజలు ఇప్పుడు ఫుట్బాల్ అడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబును జైల్లో పెడితే, ప్రజలు జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో పెట్టి లాక్ చేశారు, మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు..ట్రెండ్ సెట్ చేస్తారని లోకేష్ వ్యాఖ్యానించారు.
మహానాడు విజయవంతం
- Advertisement -
- Advertisement -