నవతెలంగాణ-హైదరాబాద్: లండన్లో టవిస్టాక్ స్క్వేర్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తుతెలియని నల్లరంగు పూశారు.గాంధీ విగ్రహం పీఠంపై భారత వ్యతిరేక రాతలు రాశాలు ఆగంతకులు. ఈ చర్యను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. సిగ్గుచేటైన చర్య అని, అహింసా సిద్ధాంతంపై జరిగిన దాడిగా పేర్కొంది.విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న దౌత్యవేత్తలు.. విగ్రహానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు, కామ్డెన్ కౌన్సిల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గాంధీ లా చదివిన యూనివర్సిటీ కాలేజీకి సమీపంలో ఉన్న టవిస్టాక్ స్క్వేర్ లో 1968లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
లండన్లోని మహాత్మా గాంధీ విగ్రహాంపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES