- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ ఆర్థికవేత్త, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్ (ఈఏసీ-పీఎం)గా నియమితులయ్యారు. ఆయన గురువారం మెయిల్ ద్వారా ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న మహేంద్రదేవ్… గతంలో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చి సంస్థ డైరెక్టర్గా (ఉప కులపతి), కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. ఈ కొత్త బాధ్యతలు రాగానే ఆయన యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.
- Advertisement -