నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పీఎం మోడీ తరుచుగా బీహార్ రాష్ట్రానికి వెళ్లివస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ముసుగులో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. క్యాంపెయిన్లో భాగంగా బీహార్ ఓటర్లను మభ్యపెట్టానికి నితిష్ ప్రభుత్వం ఇటీవల అనేక స్కీంలు ప్రారంభించింది. తాజాగా పీఎం మోడీ కూడా శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
బీహార్ ఓటర్లకు ‘మహిళా రోజ్గార్ యోజన’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES