Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. 

 పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. 

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాకిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 3.54 గంటల సమయంలో పాక్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

కాగా, శనివారం పాక్‌లో రెండు సార్లు భూమి కంపించింది. సాయంత్రం 6.53 నుంచి 7 గంటల మధ్య రెండు భూకంపాలు వచ్చాయి. తొలుత 4.4 తీవ్రతతో ప్రకంపణలు చోటుచేసుకోగా, రెండో సారి 3.2 తీవ్రతతో భూమి కంపించింది. కరాచీలో కూడా భూ ప్రకంపణలు సంభవించాయి. ఈ నెల 1 నుంచి పాకిస్థాన్‌లో 21 సార్లు భూకంపం రావడం గమనార్హం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad