- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా మెయిన్ బస్ స్టాండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



