- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వరంగల్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని షాపులు కాలిపోతున్నాయి. జేబీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపు మంటల్లో దగ్ధమైంది. పక్కన ఉన్న షాపులకు కూడా మంటలు అంటుకుని కాలిపోతుండటంతో ప్రజలు, షాపు యజమానులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటలు అర్పి వేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపులో ఫర్నిచర్ దాదాపుగా ఏం మిగల్లేదు. కళ్ల ముందు ఫర్నిచర్ షాపు కాలిపోతున్న తీరు చూసి యజమాని రోదించారు.
- Advertisement -



