నవతెలంగాణ-భూపాలపల్లి
ఈనెల 14న జిల్లా కేంద్రంలో జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్ కుమార్, సామంతుల శ్యామ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు రక్తం అందించడం కోసం ఐటీ మాస్టర్ యాజమాని శంకర్ , తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐటి మాస్టర్ క్యాంపస్ లో ఈనేల 14 న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.2011 వ సంవత్సరం నుండి ఐటీ మాస్టర్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం చేపడుతున్న రక్తదాన కార్యక్రమానికి మా వంతుగా సపోర్ట్ చేస్తూ ఇంతమంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కావున జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES