Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబంధనలకు విరుద్ధంగా మల్లారం క్వారీ నిర్వహణ..!

నిబంధనలకు విరుద్ధంగా మల్లారం క్వారీ నిర్వహణ..!

- Advertisement -

నవతెలంగాణ మల్హర్ రావు
మండలంలోని మల్లారం ఇసుక క్వారీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోంది. మానేరులో పరిమితికి మించి ఇసుకను తోడేస్తున్నారు. ఓసీపీని తలపించేలా గోతులు తీస్తున్నారు.అడ్డుఅదుపులేకుండా గోతులు తీయడంతో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదాలు ఉన్నాయని మానేరు పరివాహక ప్రాతంలో పంటలు పండిస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు మీటర్ల లోతు తీయాల్సి ఉండగా క్వారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నాలుగైదు మీటర్ల లోతుగా భూమి కనిపించేలా తోడేస్తున్నారు. క్వారీ పొడవునా రెండు మూడు కిలోమీటర్ల మేర తీయాల్సి ఉండగా నాలుగైదు కిలోమీటర్ల మేర తోడేస్తున్నారు. ఇసుక లారీలకు పార్కింగ్ ప్లేస్ లేక రోడ్డు,రైతులు పొలాలకు వేళ్ళు దారులపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న టిఎండిసి అదికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్వారీని వెంటనే మూసివేయాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -