నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ లో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్యను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఇటీవల గుండెపోటుకు గురైన పాలెపు నర్సయ్య సర్జరీ అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్యను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మైనార్టీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షులు అబ్దుల్ రఫీ, నాయకులు తెడ్డు రమేష్, కప్పదండి అశోక్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన మానాల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES