- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటి మంచు లక్ష్మీ ఈడీ విచారణకు హాజరయ్యారు. బుధవారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకురావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇప్పటికే ఈ కేసులో సినీ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఇదే కేసులో మరికొంతమంది సినీ సెలబ్రెటీలు హాజరుకానున్నారు. కాగా మనీ లాండరింగ్ అంశాలపై ఈడీ విచారణ కొనసాగుతోంది.
- Advertisement -