నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలానికి సంబంధించి 2025–26 సంవత్సరానికి గాను మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లవకుమార్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ పోటీలు ఈనెల 30 వ తేదీన రోజున ఉదయం 9.30 గంటలకు ముధోల్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో జరగనున్నాయని పేర్కొన్నారు. మండల పరిధిలోని ఐదు క్లస్టర్ల నుంచి మండల స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మండల స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అందరూ 30వ తేదీ ఉదయం 9 గంటలకు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హాజరై రిపోర్ట్ చేయాలని కోరారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలకు చెందిన ఎంపికైన క్రీడాకారులు తప్పనిసరిగా పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని ఎంపీడీవో విజ్ఞప్తి చేశారు.



