– ఎంపీకి మావోయిస్టుల పేర బెదిరింపు కాల్
నవతెలంగాణ మేడ్చల్:మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందన్రావును నేటి సాయంత్రంలోగా చంపేస్తామని ఓ ఆగంతక ఫోన్ కాల్ వచ్చింది. తాను మధ్యప్రదేశ్కి చెందిన మావోయిస్టునని ఆగంతకుడు ఫోన్లోనే ఇవాళ సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించాడు. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఎంపీ రఘునందన్ రావు పర్యటనలో ఉండగా ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది., దీంతో ఆయన పీఏ ఆ ఫోన్ కాల్ని ఎత్తాడు. 912143352974 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దమ్ముంటే కాపాడుకోండి అంటూ రఘునందన్ని ఆగంతకుడు బెదిరించాడు.
దమ్మాయిగూడలో ఎంపీ రఘునందన్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్రావుకి ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్కి, సంగారెడ్డి ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై బీజేపీ అగ్రనేతలు ఎంపీ రఘునందన్రావుకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.