- Advertisement -
బంతి పువ్వులకు భలే గిరాకీ
నవతెలంగాణ – మద్నూర్
దీపావళి లక్ష్మీ పూజలకు బంతి పువ్వులను ప్రజలు వ్యాపారులు ప్రత్యేకంగా వాడుతారు బంతి పువ్వులో ఇండ్లకు వ్యాపార సముదాయలకు ఎంతో శోభనిస్తాయి బంతిపూల దండలతో రూపులు దిద్దుతారు. దీపావళి పండుగ కోసం మద్నూర్ మండల కేంద్రంలో బంతి పువ్వులు అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. రూ.100 కిలో చొప్పున అమ్ముతున్నప్పటికీ బంతి పువ్వులకు భలే గిరాకీ కొనసాగుతుంది. పచ్చటి పువ్వులు ఎర్రటి పువ్వులు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి ప్రతి ఒక్కరు బంతి పువ్వుల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
- Advertisement -