నవతెలంగాణ – కంఠేశ్వర్
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రoలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వెన్ను నొప్పితో 35 సంవత్సరాల రాధిక ను మూడు రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకురాగా, గురువారం రాత్రి ఆమెకు వెన్నుపూసకు సంబంధించి సర్జరీ చేసిన వైద్యులు ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో రాధిక మృతి చెందిందని వైద్యులు తెలపడంతో మృతురాలి బంధువులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం పడిగల్ గ్రామానికి చెందిన రాధిక(35) వెన్ను నొప్పితో బాధపడడంతో ఆమెను భర్త సురేశ్ ప్రతిభఆస్పత్రికి తీసుకొచ్చాడు. రాధికకు వెన్నుపూస ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలపడంతో సురేశ్ ఒప్పుకున్నాడు. గురువారం ఉదయం ఆపరేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆమెను వెంటిలేటర్ పై ఉంచగా శుక్రవారం ఉదయం మృతి చెందింది. సుమారు ఏడు గంటలపాటు వైద్యులు ఆపరేషన్ చేసి తన భార్యను వెంటిలేటర్ పై వేశారని, వారి నిర్లక్ష్యం కారణంగానే రాధిక మృతి చెందిందని ఆమె భర్త సురేశ్ ఆరోపించాడు. మృతురాలు రాధిక కు భర్త, ఐదేళ్ల పాప ఉన్నట్లు తెలిసింది. మృతురాలి బంధువుల ఆందోళనతో భారీగా పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. నగర సీఐ శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో బరిగా పోలీసులు మోహరించారు. రాధిక మృతికి కారణమైన వైద్యులను అరెస్టు చేసే వరకు కదిలేది లేదని మృతురాలు బంధువులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. సుమారు 5, 6 గంటల తర్వాత గొడవ సద్దుమణిగింది. అనంతరం ప్రతిభా ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు మీడియాతో మాట్లాడుతూ… వెన్నపూసకు సంబంధించి ఆపరేషన్ పూర్తి చేశాక రక్తస్రావం ఎక్కువగా జరిగిందని, అది జన్యుపరమైన లోపం ఉండడంతోనే జరిగిందని తెలిపారు. చికిత్స పొందుతూ సడన్గా కార్డియాకు అరెస్టు అయి మృతి చెందిందని తెలిపారు.
ప్రయివేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో వివాహిత మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES