- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా గురువారం జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో)తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా భారత్, జపాన్లోని స్టార్టప్ సంస్థలకు మద్దతును అందిచనున్నట్లు మారుతి సుజుకి పేర్కొంది. పరస్పరం వ్యాపార అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి సీఈఓ, ఎండీ మిసషి టకెచి సమక్షంలో ఆ సంస్థ డిజిటల్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తపన్ సాహు, జెట్రో చీఫ్ డైరెక్టర్ జనరల్ టకసి సుజుకి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
- Advertisement -