- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలు నైజీరియాలోని మోక్వా సిటీని వణికిస్తున్నాయి. నిగర్ నది ఉప్పొంగడంతో 3వేలకు పైగా ఇళ్లు నీట మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు కాగా, వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు. 115 మంది మృతదేహాలను వెలికి తీశామని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. కాగా 2022లో ఆ దేశంలో వచ్చిన వరదలకు 14 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 600 మంది చనిపోయారు.
- Advertisement -