Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలి 

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : భీంగల్ మండలంలోని 27 గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తగు చర్యలు తీసుకొని అంటూ రోగాల నివారణకు కృషి చేయాలనీ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. ఈ రోజు భీంగల్ మండల పరిషత్ కార్యలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఏ ఎన్ ఎమ్ లు, ఆశ కార్యకర్తలు, ఐసీడీఏస్, ఐకేపీ సిబ్బంది తో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.గ్రామంలో పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలని, అంటి లార్వా స్ప్రే, ఫాగింగ్  చేయాలనీ, ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే నిర్వహించాలని కోరడం జరిగింది. డెంగీ జ్వరాలు ప్రభలకుండా ఇంట్లో, పరసరాల్లో నిలువ ఉన్న నీటి ఎప్పటికి అప్పుడు తొలగించాలని, డెంగ్యూ జ్వరం పరీక్ష యంత్రం సబ్ సెంటర్  మరియు పి హెచ్ సి లలో అందుబాటులో ఉన్నాది ప్రజలు వినయోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ శివ కృష్ణ,మెడికల్ ఆఫీసర్ అజయ్,ఐసీడీస్ సూపర్వైజర్ శారద, ఎంపీవో శివచరణ్, ఆరోగ్య సిబ్బంది, కార్యదర్శులు ఐకేపీ, ఐసీడీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -