- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారి స్వప్న ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గ్రామ ప్రజలతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ హెచ్ఇఓ ఆర్. మధు నాయక్, డాక్టర్ అభిలాష్, ఎంఎల్ఎచ్పీలు రాజు, నవ్య, బిందు, రజిని, ఏఎన్ఎమ్లు, హెల్త్ అసిస్టెంట్ సుభాకర్, జగదీష్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



