- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రంలోప్రాథమికస్తాయి ఉపాధ్యాయులకు 5 రోజుల వృత్యంతర శిక్షణలో తరగతులలో భాగంగా మొదటిరోజు శిక్షణ ను మండల విద్యాధికారి తరి రాము మండల నోడల్ అధికారి శేశు రిసోర్స్ పర్సన్ లు మంగళవారం ప్రారంభించారు. సిఆర్పి లు,ఉపాధ్యాయులు ఈ శిక్షణ కు హాజరైనారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు తరగతిగదిలో విద్యార్థులకు సంతోషకరంగా ఎలా భోధించాలో, అలాగే చదవడం,రాయడం వంటి సామర్ధ్యాలను సాధించడానికి కావాల్సిన పద్ధతులు తెలియ జేశారు. శిక్షణలో అర్పిలు దేవేందర్, దుర్గాప్రసాద్ నరేందర్, సంతోష్, నర్సింహ, జాహెదబెగం, కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -