Tuesday, November 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం..తెలంగాణ క్యాబినెట్ కీల‌క నిర్ణ‌యం

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం..తెలంగాణ క్యాబినెట్ కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జీహెచ్‌ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. పెద్ద అంబర్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయంజాల్‌, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్‌, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్‌, బొల్లారం, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బోడుప్పల్‌, నిజాంపేట్‌, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్‌ మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అంతేకాకుండా మరో డిస్కమ్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. కొత్త డిస్కమ్‌ పరిధిలోకి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కనెక్షన్లు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్‌ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే పదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌కు అవసరమైన ఏర్పాట్లపై చర్చినట్లు వివరించారు. ఈ క్రమంలోనే 3వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -