Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంఆ రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ‌ రెడ్ అల‌ర్ట్

ఆ రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ‌ రెడ్ అల‌ర్ట్

- Advertisement -



నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇప్పటికే ముంబై భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట, గోవా, కర్ణాటకకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -