శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోమారు ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే వేలాది మందికి ఉద్వాసన పలికిన మైక్రోసాఫ్ట్ తాజా పునర్నిర్మాణంలో భాగంగా మరోమారు వేలాది మందిని ఇంటికి పంపించే పనిలో ఉందని బ్లూమ్బర్గ్ ఓ రిపోర్ట్లో తెలిపింది. తాజా రౌండ్ ఉద్వాసనలు సేల్స్ విభాగంలో ఉండొచ్చని వెల్లడించింది. ఈ ఏడాది మే నెల మధ్యలో మూడు శాతం లేదా దాదాపు 6వేల మందిని తొలగించింది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కావడం గమనార్హం. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో కూడా పనితీరు ఆధారంగా కొంతమందిని ఆ సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. ఈనెల ఆరంభంలో కూడా పలువురిపై సంస్థ వేటు వేసింది. సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ పలుసార్లు పేర్కొంది.
మైక్రోసాఫ్ట్లో మళ్లీ ఉద్వాసనలు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES