నవతెలంగాణ-హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ అదనపు కోతల్లో భాగంగా మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసినట్లు నివేదిక తెలిపింది. వర్కర్ అడ్జెస్ట్మెంట్ అండ్ రిట్రైనింగ్ (డబ్ల్యుఎఆర్ఎన్) నుండి జూన్ 2న (మంగళవారం) వచ్చిన నోటీసులో 305మంది ఉద్యోగులను తొలగించినట్లు ఉందని టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. అయితే ఎఐ కారణంగా ఈ కోతలు విధించారా లేదా అనే అంశంపై మైక్రోసాఫ్ట్ స్పందించలేదు. గతనెలలో సుమారు 3శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. టెక్ రంగంలో విజయం సాధించేందుకు, కంపెనీని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగత మార్పులు కొనసాగుతూనే ఉంటాయని కంపెనీ ఆ నోటీసులో పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల కాలంలో వాషింగ్టన్లోనే సుమారు 2,300మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
మరో 300మందికి పైగా ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES