- Advertisement -
నవతెలంగాణ-మిడ్జిల్: విద్యుత్ షాక్తో పాలిచ్చే ఆవు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన జంగాల కృష్ణయ్య ఆవు వ్యవసాయ పొలంలో విద్యుత్ నియంత్రిక( ట్రాన్స్ఫార్మర్) దగ్గర మేత మేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగలడంతో అక్కడికక్కడే ఆవు మృతి చెందింది. దాదాపు 80 వేల రూపాయలు ఆవు మృతి చెందడంతో రైతు కన్నీరు మునిరయ్యారు. ప్రభుత్వపరంగా రైతు కూలి జంగాల కృష్ణయ్య ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు.
- Advertisement -



