- Advertisement -
- బెంగాల్లో రైతుల భారీ నిరసన ర్యాలీ
నవతెలంగాణ-హైదరాబాద్: రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపూర్లో శుక్రవావరం భారీ నిరసన ర్యాలీ జరిగింది. దీనిలో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం ప్రసంగించారు. రైతులు, కార్మికులను ప్రభావితం చేస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శిం చారు. ప్రభుత్వ విధానాల కారణంగా శ్రామికులు ఎదుర్కొంటున్న సమస్యల ను ఆయన వివరించారు.. రైతులకు చట్టబద్ధ హామీ అయిన కనీస మద్దతు ధరను అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు వంద రోజుల పనిని తప్పనిసరిగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -



