Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి సీఆర్టీలకు మినిమం టైంస్కేల్‌ వర్తింపజేయాలి

సింగరేణి సీఆర్టీలకు మినిమం టైంస్కేల్‌ వర్తింపజేయాలి

- Advertisement -

– ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కనీస మూలవేతనం (ఎంటీఎస్‌)ను వర్తింపజేయాలనీ, 12 నెలల వేతనం చెల్లించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సింగరేణి చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాంను గురువారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణి సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులను విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులకు సింగరేణి ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సింగరేణి సంస్థ కట్టుబడి ఉందంటూ సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్‌, పుల్గం దామోదర్‌రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షులు సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -