Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం

మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం

- Advertisement -

– ఊడిపోయిన కారు టైర్‌
నవతెలంగాణ – మెట్‌పల్లి

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి వచ్చిన మంత్రి.. ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకుల ఆహ్వానం మేరకు మెట్‌పల్లి వచ్చారు. తిరిగి ధర్మపురికి వెళ్తుండగా ఆరపేట్‌ శివారులో మంత్రి ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢకొీట్టింది. దీంతో మంత్రి వాహనం ముందు టైర్‌ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో మంత్రికి ఎలాంటి ప్రమాదమూ కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో వాహనంలో మంత్రిని ధర్మపురి క్యాంప్‌ కార్యాలయానికి పంపించారు. కాగా ఇది అడ్లూరికి రెండో ప్రమాదం. ప్రభుత్వ విప్‌ హోదాలో ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -