Sunday, June 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉమ్మడి వరంగల్‌ జిల్లాల సమీక్షలో..కలెక్టర్లపై మంత్రి 'పొంగులేటి' ఆగ్రహం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల సమీక్షలో..కలెక్టర్లపై మంత్రి ‘పొంగులేటి’ ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/సుబేదారి
హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్‌ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో గురువారం ధాన్యం సేకరణ, వానాకాలం సన్నద్ధత, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, జూన్‌ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారులకు ఎవరికీ నేటికీ ప్రొసీడింగ్స్‌ జారీ చేయకపోవడం పట్ల జిల్లా కలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సాయంత్రం 6గంటలలోపు అర్హులుగా తేల్చిన లబ్దిదారు లకు ప్రొసీడింగ్స్‌ను జారీ చేయాలని ఆదేశించారు. ధర్మసాగర్‌ మండలంలో 600 చదరపు అడుగుల మేరకు ఇండ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు చెల్లింపులు చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని, పద్ధతి మార్చు కోవాలని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -