- Advertisement -
- – మేడారంలో పూజారుల అతిథి గృహ సముదాయ
- – భవనం ను ప్రారంభించిన మంత్రి సీతక్క
- నవతెలంగాణ -తాడ్వాయి
- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం లో ఒక కోటి 98 లక్షల తో నిర్మించిన, సమ్మక్క- సారలమ్మ జాతర, మేడారం పూజారుల అతిథి గృహ సముదాయ భవనం ను గురువారం రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి ప్రారంభించారు. మొదట మంత్రి సీతక్క సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చిరే సారే సమర్పించి ప్రత్యేకము కొలిచలించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో వీరస్వామి, ఓ ఎస్ డి రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, పరిశీలకులు ఎన్ కవిత, పూజార్లు, మునీందర్, మహేశ్, నితిన్,కొక్కెర కిష్టయ్య, కాకా వెంకటేశ్వర్లు, కాక కిరణ్, కాక సారయ్య, దెబ్బకట్ల గోవర్ధన్, బోజా రావు, క్రాంతి సూపర్డెంట్ మరియు దేవస్థాన సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -