పౌర సేవలు, భద్రతపై ప్రయాణీకులతో మాటామంతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శనివారం మెట్రో రైలులో ఆకస్మికంగా ప్రయాణించారు. నగరవా సుల ”మెట్రో” అనుభవాలను స్వయంగా తెలుసు కునేం దుకు సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొని, తూర్పున ఉన్న నాగోల్ స్టేషన్ నుంచి పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ రాయదుర్గం వరకు ప్రయాణించారు. మెట్రో సేవలు, సౌకర్యాలు, స్టేషన్లలో భద్రత, రవాణా సవాళ్లు, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రయాణీకులతో ముచ్చటించారు. ప్రజలకు మెరుగైన, వేగవంత మైన రవాణాను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఈ సందర్భ ంగా అన్నారు. నగరంలో ప్రజా రవాణా బలోపే తానికి ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఆర్ఆర్ఆర్, ఇతర భవిష్యత్ ప్రణాళికలను ప్రయా ణీకులకు వివరించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తమ ప్రభుత్వం. ప్రశంసలతో పాటు… విమర్శలను స్వీకరిస్తుం దని చెప్పారు.
మెట్రోలో ప్రయాణించిన మంత్రి శ్రీధర్బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES