- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నేరేడుచర్ల, మఠంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మంత్రి మూడు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.
- Advertisement -