- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో జులై 13 నుంచి నిర్వహించనున్న బోనాల మహోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. సోమవారం సెక్రటేరియట్లో మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
- Advertisement -