- Advertisement -
నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పూజారుల కోసం నిర్మించిన సమ్మక్క- సారలమ్మ ధార్మిక భవనం మేమో ప్రారంభోత్సవం, మేడారం సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాలను నూతనంగా నిర్మించడానికి శంకుస్థాపన (భూమి పూజ) లు నిర్వహించడానికి రేపు గురువారం దేవదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లు ప్రారంభించినట్లు పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, చంద గోపాలరావు, చంద రఘుపతి లు ఓ ప్రకటనలో తెలిపారు. పూజారులు, పూజారులకు సంబంధించిన కుటుంబాల వారు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
- Advertisement -