- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్ప వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి 8,758 క్యూసెక్కుల వరద చేరుతోంది. అవుట్ఫ్లో 12,713 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 817 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. అలాగే, తుంగభద్ర రిజర్వాయర్కు 7,365 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. వర్షాలు ఇలాగే కొనసాగితే వరద పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -