– టికె.ఏస్.ఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి
నవతెలంగాణ – ఆత్మకూరు : తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ గురుకుల డిగ్రీ కళాశాలలు వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సుమారు పదివేల మంది విద్యార్థులు ప్రతి ఏటా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి బయటకు వెళ్తున్నారు. పై చదువులకు చదువుకునేందుకు గురుకుల డిగ్రీ కళాశాలలు లేనందున వేల మంది విద్యార్థులు ఐదేళ్లుగా ఇంటర్ చదువుతో నే చదువులకు స్వస్తి పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 పైగా గురుకుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, మైనార్టీలకు మాత్రం ఒక్క కళాశాల కూడా లేదని, ఇది మైనార్టీ విద్యార్థులపై ప్రభుత్వానికి చిన్న చూపు అని ఆయన విమర్శించారు. వెంటనే 2025-26 ఈ విద్యా సంవత్సరంలో బాల, బాలికలకు వేర్వేరుగా మైనార్టీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వలి డిమాండ్ చేశారు.
మైనార్టీ గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES